ఆరు నెలల్లో కేసీఆర్ తప్పక రాజీనామా చేస్తారు : కిషన్ రెడ్డి

-

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పై కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. కేసీఆర్ దేశాన్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ రాజీనామా చేస్తానని ఎన్నోసార్లు చెప్పారని.. ఆరేడు నెలలు ఆగితే రాజీనామా చేసే పరిస్థితి తప్పకుండా వస్తుందని అన్నారు.

‘‘తిరుమలరాయుని పిట్టకథ దేశంలో ఒక్క కేసీఆర్‌కు మాత్రమే వర్తిస్తుంది. 2014లో రాష్ట్ర అప్పు ₹60వేల కోట్లు.. ఇప్పుడు ₹5లక్షల కోట్లు. కల్వకుంట్ల కుటుంబ మంత్రులు.. నోరు తెరిస్తే అబద్ధాలు చెబుతున్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై ఐఎంఎఫ్‌ ఏం చెప్పిందో కేసీఆర్‌ గూగుల్‌లో చూసి తెలుసుకోవాలి. కేసీఆర్‌ చెప్పిన లెక్కలపై చర్చకు నేను సిద్ధం. ఎక్కడికి రమ్మంటారో చెప్పాలి. కేసీఆర్‌ రాజీనామా చేస్తానని ఎన్నోసార్లు చెప్పారు. ఆరేడు నెలలు ఆగితే రాజీనామా చేసే పరిస్థితి తప్పకుండా వస్తుంది ’’ అని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news