సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ లేఖ

-

తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావుకు లేఖ రాశారు బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ప్రమోషన్లు అడిగితే సస్పెండ్ చేస్తారా? అని ప్రశ్నించారు. భాషా పండితులకు మాతృభాషా దినోత్సవ కానుక ఇదేనా? అంటూ నిలదీశారు. వెంటనే వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేసి.. భాషా పండితుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

22 ఏళ్లుగా ప్రమోషన్లు ఇవ్వకపోవడం ఏంటని లేఖలో ప్రశ్నించారు బండి సంజయ్. ప్రపంచ తెలుగు మహాసభల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? తక్షణమే పిఆర్సి ని ఏర్పాటు చేసి ఉద్యోగ, ఉపాధ్యాయులకు జూలై 1 నుంచి జీతాలు చెల్లించాలని లేఖలో డిమాండ్ చేశారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news