ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారీగా దొంగఓట్లు చేర్చారు – అచ్చెన్నాయుడు

-

ఎమ్మెల్సీ ఎన్నికలలో భారీగా దొంగ ఓట్లు చేర్చారని ఆరోపించారు టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి అరాచకాలకు సపోర్ట్ చేసే అధికారులంతా జైలుకు వెళ్ళక తప్పదని హెచ్చరించారు. వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పక్కదారి పట్టించడానికి స్కిల్ డెవలప్మెంట్ స్కాం ను తెరపైకి తీసుకువచ్చారని విమర్శించారు.

అచ్చెన్నాయుడు
అచ్చెన్నాయుడు

ఆ స్కాంతో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి సంబంధం లేదన్నారు అచ్చెన్నాయుడు. నారా చంద్రబాబుపై బురద జల్లాలని చూస్తే అది మీకే అంటుకుంటుందని అన్నారు. పట్టభద్రుల ఎన్నికలలో వాలంటీర్లు వైసీపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఉపాధ్యాయులు, పట్టబద్రులకు ఫోన్ పేతో వైసిపి డబ్బులు పంచుతుందని ఆరోపించారు. త్వరలోనే గొడ్డలి పోటు కేసులో తండ్రి, కొడుకు అరెస్ట్ అవుతారని జోష్యం చెప్పారు అచ్చెన్నాయుడు.

Read more RELATED
Recommended to you

Latest news