ఆస్కార్ కోసం ఓటు వేసిన సూర్య.. పోస్ట్ వైరల్..!!

-

మరో రెండు రోజుల్లో ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా జరగబోతున్నాయి. మార్చి 12వ తేదీన అమెరికాలోని లాస్ ఏంజిల్స్ లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 95 వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం చాలా ఘనంగా జరగబోతోంది. ఈసారి అకాడమీ అవార్డ్స్ ను ఇండియన్స్ ఇంట్రెస్ట్ గా చూడబోతున్నారు. దానికి కారణం అందరికీ తెలిసిన విషయమే. ఇండియన్ సినిమాకు ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చిన ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాట ఆస్కార్ కి నామినేట్ అయింది.

దాదాపు ఆస్కార్ కన్ఫామ్ అంటున్నారు కూడా.. అంతేకాదు ఆస్కార్ వేదిక మీద మన తెలుగువారి పెర్ఫార్మెన్స్ లు కూడా ఉన్నాయి అని.. సిగ్నల్స్ రావడంతో లైవ్ చూడడానికి ఇప్పుడు అంతా సిద్ధమవుతున్నారు. ఇది ఇలా ఉండగా ఇప్పటికే జ్యూరీలో సభ్యులుగా ఉన్న మన ఇండియన్ స్టార్స్ తమ ఓటు వినియోగించుకుంటున్నారు. తాజాగా ఈ అవార్డుల కోసం జ్యూరీ మెంబర్స్ ఓటింగ్ చేస్తున్నారు. ఆస్కార్ జ్యూరీ సభ్యుడుగా ఉన్న తమిళ్ స్టార్ హీరో సూర్య కూడా తన ఓటు వేసినట్లు సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. అయితే సూర్య తన ఓటును ఎవరికి వేశాడు అనేది ఇప్పుడు అంత ఆసక్తిగా చూస్తున్నారు.

ఇకపోతే ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు గెలవాలని తెలుగు రాష్ట్రాలతో పాటు మొత్తం పాన్ ఇండియా ఆడియన్స్ కోరుకుంటున్నారు. ఈ సాంగ్కు ఆస్కార్ రావాలని ప్రత్యేకంగా పూజలు కూడా చేస్తున్నారు అభిమానులు. మరి అందరి ఆశీస్సులు మేరకు ఈ సినిమా లోని పాట ఆస్కార్ అవార్డును దక్కించుకుంటుందా…ఈ పాటతో కీరవాణికి ఆస్కార్ అవార్డు లభిస్తుందా? అనేది ఇప్పుడు ఉత్కంఠ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news