BREAKING : కవిత నోటీసులపై కేసీఆర్‌ కీలక నిర్ణయం

-

BREAKING : కవిత నోటీసులపై తెలంగాణ సీఎం కేసీఆర్‌ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగానే, ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ, లెజిస్లేటి పార్టీ సహా, రాష్ట్ర కార్యవర్గ.. సంయుక్త సమావేశం నిర్వహించనున్నారు ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు. తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన సమావేశం జరుగనుంది.

బీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లాల పార్టీ అధ్యక్షులు , జిల్లా పరిషత్ చైర్మన్ లు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్ లు, డిసిఎమ్ఎస్, డి సి సి బి చైర్మన్ లు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. కవిత కు నోటీసుల వ్యవహారంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఇక ఎన్నికల సంవత్సరమైన నేపథ్యంలో … ప్రజల్లోకి ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరు.. పార్టీ కార్యకలాపాల పై చర్చ నిర్వహించనున్నారు సీఎం కేసీఆర్‌.

Read more RELATED
Recommended to you

Latest news