రాజధానిపై సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

-

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రులతో జరిగిన కేబినెట్ భేటీలో సీఎం జగన్ మాట్లాడుతూ.. జూలైలో విశాఖకు వెళ్తామని ఆయన మంత్రులతో చెప్పినట్టు తెలుస్తోంది. కాగా త్వరలోనే విశాఖపట్నం షిఫ్ట్ అవుతామని ఇటీవల జగన్ చెప్పిన విషయం తెలిసిందే.

త్వరలోనే విశాఖ ఏపీ రాజధానిగా మారబోతుందని, సీఎం ఆఫీస్ కూడా విశాఖలోనే ఉండబోతున్నట్లు జగన్ గతంలోనే తెలిపారు. ఇటీవల జరిగిన గ్లోబల్ సమ్మిట్ లో కూడా సీఎం జగన్ ఇవే వ్యాఖ్యలు చేశారు. ఏపీకి మూడు రాజధానులు అంటూ సాగదీయకుండా.. విశాఖపట్నం రాజధాని అని, త్వరలో విశాఖ నుంచే పాలన మొదలవుతుందని అన్నారు. ఈ క్రమంలోనే జూలైలో విశాఖకు షిఫ్ట్ అవుతానని ఇప్పుడు జగన్ క్లారిటీ ఇచ్చినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news