టిడిపి , జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తాం – సీపీఐ నేత నారాయణ

-

రాబోయే ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలతో కలిసి సీపీఐ ఎన్నికల బరిలో నిలవబోతుంది…టిడిపి , జనసేన, సీపీఐ కలిసే పోటీ చేస్తామని ప్రకటించారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. కలవడం అంటూ జరిగితే మా ఓట్లు ఇవ్వడం మాత్రమే కాదు మాకు సీట్లు కూడా కావాలి….వీరుడు, సూరుడు అనుకున్న జగన్ కేంద్రం దగ్గర మొకరిల్లుతున్నాడని తెలిపారు.

పోలవరం విషయం లో వాళ్ల నాన్న వైఎస్ లో ఉన్న పోరాట స్ఫూర్తి జగన్ లో కనిపించడం లేదు…వాళ్ల నాన్న సిద్ధాంతాలకు కూడా పంగ నామాలు పెట్టిన వ్యక్తి గా జగన్ మిగిలిపోయే లా ఉన్నాడని వెల్లడించారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం సలహాలు ఇచ్చినా తీసుకునే తత్వం జగన్ కు లేదు…పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని కోరారు. పోలవరం ఎత్తు పెంచడం తో పాటు నిర్వాసితులకు నష్టపరిహారం అందజేయాలి..పోలవరం విషయంలో విభజన హామీల హక్కులు సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం వెనుక బడిపోయిందన్నారు. మీకు పోరాడటానికి భయం గా ఉంటే అఖిల పక్షానికి ఢిల్లీ తీసుకువెళ్ళండి ,విభజన హామీలు మేము సాధించుకు వస్తామని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news