BREAKING : రేపు ఢిల్లీకి వెళ్ళనున్న సీఎం జగన్

-

BREAKING : రేపు ఢిల్లీకి వెళ్ళనున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. రేపు సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు ముఖ్యమంత్రి జగన్‌. ఈ నెల 16వ తేదీన ఢిల్లీకి వెళ్ళి… ప్రధాని మోడీతో భేటీ అయ్యారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. అయితే.. ఇప్పుడు హఠాత్తుగా రెండో సారి ఢిల్లీ పర్యటన పెట్టుకున్నారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.

రెండు వారాల్లోపే సీఎం ఢిల్లీ పర్యటన పై ఉత్కంఠత నెలకొంది. దీనిపై ప్రతి పక్షాలు కూడా ఆరా తీస్తున్నాయి. నేడు అమరావతిపై సుప్రీం కోర్టు లో విచారణ జరుగనుంది. అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంలో పిటీషన్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. హైకోర్టు తీర్పును యధాతధంగా అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీంను ఆశ్రయించారు అమరావతి రైతులు. ఇవాళ సుప్రీం కోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందోననే ఆసక్తి అందరిలోనూ ఉంది. ఈ తరుణంలోనే ఢిల్లీ పర్యటనకు సిద్ధం అయ్యారు జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news