ఏపీ ప్రజలకు అలర్ట్.. కొత్త జిల్లాల పేర్లతో అడ్రస్ సర్టిఫికెట్లు

-

ఏపీ ప్రజలకు అలర్ట్..  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి కొత్త జిల్లాల పేర్లతో అడ్రస్ సర్టిఫికెట్లు ఇవ్వాలని జగన్  ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆధార్ కార్డులో కొత్త జిల్లాల పేర్లు చేర్చేందుకు వీలుగా ఏర్పాట్లు చేసింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో.. కొత్త జిల్లాల పేర్లతో అడ్రస్ సర్టిఫికెట్లు ఇచ్చేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఇది ఇలా ఉండగా, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఇవాళ తన పార్టీ ఎమ్మెల్యేలతో తాడేపల్లిలో సమావేశం కానున్నారు. ఈ సమావేశం ఇవాళ మధ్యాహ్నం జరిగే ఛాన్స్ ఉంది. ఈ సమావేశంలో, గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సీఎం జగన్ సమీక్షించనున్నారు. ఎమ్మెల్యేల పనితీరుపై తన వద్ద ఉన్న సమాచారం ఆధారంగా వారికి కర్తవ్య బోధ చేయనున్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ, ప్రాంతీయ సమన్వయకర్తలు పాల్గొననున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news