BIG BREAKING : పేపర్ కాపీయింగ్ కేసులో A1 గా బండి సంజయ్

-

తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఉదయం బండి సంజయ్ ను అరెస్ట్ చేసిన కరీంనగర్ పోలీసులు కాసేపటి క్రితమే హనుమకొండ కోర్ట్ కు తరలించారు. అయితే మరికాసేపట్లో మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచనుండగా .. బండి సంజయ్ పై పెట్టిన కేసులు సంచలనంగా మారుతున్నాయి. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ కేసులో బండి సంజయ్ ను A1 గా పేర్కొంటూ కేసు నమోదు చేశారు. ఇదే కేసులో ప్రశాంత్ ను A2 గా, మహేష్ ను A3 గా మరియు శివగణేష్ ను A4 గా నమోదు చేశారు. ఈ విషయం తెలిసిన తర్వాత తెలంగాణ ప్రజలు మరియు బీజేపీ కార్యకర్తలు షాక్ అవుతున్నారు.

ఈ కేసులో బండి సంజయ్ A1 గా పెట్టడం ఏమిటి ? అసలు ఏమి జరిగింది అంతో ఆరాలు తీస్తున్నారు. అయితే ఈ విషయం అన్నది తెలియాలంటే మెజిస్ట్రేట్ దగ్గర విచారణ జరిగిన తర్వాతే తెలుస్తుంది. అప్పటి వరకు సస్పెన్స్ గా ఉండనుంది. పోలీసులు ఏ సెక్షన్ ల మీద కేసు పెట్టారో కూడా చార్జీ షీట్ ద్వారానే తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news