మల్లు రవి: బాణసంచా కాల్చడం వల్లే ఇంత ఘోరం !

-

ఈ రోజు ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో BRS ఆత్మీయ సమ్మేళనం జరిగిన విషయం తెలిసిందే. అయితే అనుకోని విధంగా అగ్నిప్రమాదం జరిగింది. దీనిపై అటు ప్రభుత్వం మరియు ఇతర పార్టీ నాయకులు స్పందిస్తూ గాయపడిన వారికి తగు చికిత్సను అందిస్తున్నారు. కాగా ఈ ప్రమాదంపై తాజాగా కాంగ్రెస్ నేత మల్లు రవి స్పందించాడు.

ఈ అగ్ని ప్రమాదం BRS నాయకులు బాణసంచా పేల్చడం వలనే జరిగింది అని ఆరోపించారు. ఎటువంటి ఉపయోగం లేని ఆత్మీయ సమ్మేళనాలు పేరుతో పేదల జీవితాలతో ఆడుకోవద్దు అంటూ BRS పై ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఈ ప్రమాదంలో ఇద్దరు మరణించగా… మరికొంతమంది గాయాలు పాలయ్యారు. ప్రస్తుతం వీరు అంతా ఖమ్మం లోని గవర్నమెంట్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news