మెడికో ప్రీతి మృతి కేసులో వైద్య విద్యార్థి సైఫ్‌కు బెయిల్‌

-

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వరంగల్ ఎంజీఎం వైద్య విద్యార్థిని ప్రీతి ఆత్మహత్య కేసులో నిందితుడు సైఫ్​కు బెయిల్‌ లభించింది. షరతులతో కూడిన బెయిల్ మంజూర్ చేస్తూ రెండవ అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు సైఫ్ దాఖలు చేసుకున్న మూడు బెయిల్ పిటిషన్లను కోర్టు కొట్టివేంది.

తాజాగా 10 వేల సొంత పూచీ కత్తుతో పాటు అంతే మొత్తానికి ఇద్దరు వ్యక్తుల పూచీ కత్తును.. కోర్టుకు సమర్పించాలని బెయిల్ ఉత్తర్వులో పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల నుంచి రెండు గంటల మధ్య, 16 వారాల పాటు కేసు విచారణ అధికారి వద్ద హాజరు కావాలని నిర్దేశించారు.

సాక్షులను ఎట్టి పరిస్థితుల్లో ప్రభావితం చేయవద్దని, మృతురాలి కుటుంబ సభ్యలను బెదిరించే ప్రయత్నం చేయవద్దని న్యాయమూర్తి నిబంధనలు విధించారు. న్యాయస్థానం విధించిన నిబంధనలను ఉల్లంఘిస్తే అతని బెయిల్​ను రద్దు చేయాలని పోలీసులు కోరవచ్చని జిల్లా కోర్టు న్యాయమూర్తి ఉత్తర్వులో పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news