సూడాన్​ టు భారత్.. ‘ఆపరేషన్ కావేరి’తో 1400 మంది సేఫ్

-

అంతర్యుద్ధంతో అతలాకుతలమవుతున్న సూడాన్ నుంచి భారతీయులను సురక్షితంగా స్వదేశానికి రప్పించే ఆపరేషన్ కావేరి సజావుగా కొనసాగుతోంది. ఇప్పటికే సూడాన్​ నుంచి ఈ ఆపరేషన్​లో భాగంగా 2400 మంది భారతీయులను కేంద్రం తరలించింది. భారత వాయుసేన, నావికా దళం వీరిని బయటకు తీసుకొచ్చింది. ప్రైవేటు ఎయిర్​లైన్ ఇండిగో సైతం భారతీయుల తరలింపు ప్రక్రియలో పాల్గొంది.

శుక్రవారం రోజున పలు బ్యాచ్​లలో అనేక మంది భారతీయులు సూడాన్ నుంచి జెడ్డాకు చేరుకున్నారు. వీరందరినీ భారత్​కు తరలించనున్నారు. భారతీయులతో పాటు ఇతరులకు సైతం వాయుసేన సహాయం చేసింది. సూడాన్​లో సైన్యం, పారామిలిటరీ దళాల మధ్య పోరాటం జరుగుతోంది. పారామిలిటరీని సైన్యంలో కలిపేయాలని సైనిక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఘర్షణకు ఆజ్యం పోసింది. దీంతో సైన్యం, పారామిలిటరీ దళాల అధిపతులు పోరాటానికి దిగారు.

ఈ హింసాత్మక ఘర్షణల్లో వందలాది సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. ఘర్షణల మధ్య మూడు రోజుల పాటు కాల్పుల విరమణకు ఇరువర్గాలు అంగీకరించారు. ఈ సమయంలోనే భారత్.. సహాయక చర్యలు ప్రారంభించింది. భారతీయులందరినీ వెనక్కి తీసుకెళ్లేందుకు సైన్యాన్ని రంగంలోకి దించింది. విమానాలు, యుద్ధ నౌకలను అక్కడికి పంపించింది.

Read more RELATED
Recommended to you

Latest news