చికోటి ప్రవీణ్ తో థాయ్ లాండ్ తో 12 మంది ఏపీ వ్యక్తులు అరెస్ట్

-

నిన్న థాయ్‌ లాండ్‌ లో చికోటి ప్రవీణ్ అరెస్ట్‌ అయిన సంగతి తెలిసిందే. అయితే, చికోటి ప్రవీణ్ తో థాయ్ లాండ్ వెళ్లిన ఏపీ వాసులు కూడా అరెస్ట్‌ అయినట్లు సమాచారం అందుతోంది. నూజివీడు, ఏలూరు, బెజవాడ ప్రాంతాలకు చెందిన 12 మంది ఉన్నట్టు గుర్తించారు. నూజివీడుకి చెందిన సురేష్, రాహుల్ చికొటి తో పాటు పోలీసులకు చిక్కినట్టు సమాచారం అందుతోంది.

చికోటితో పాటు వెళ్లిన నూజివీడుకు చెందిన ఐదుగురు మిత్ర బృందం, విజయవాడ రూరల్ కు చెందిన ముగ్గురు మిత్రులు ఉన్నారట. ఈ నెల 4న వివాహం ఉండటంతో నూజివీడు గ్రూప్ లో ముగ్గురు నిన్నే బయల్దేరి బెజవాడ వచ్చినట్టు గుర్తించిన పోలీసులు… సురేష్, రాహుల్ అక్కడే ఉండి పోలీసులకు పట్టుబడినట్టు సమాచారం. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల నుంచి వెళ్ళిన సమాచారం సేకరిస్తున్నాయి ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ వర్గాలు. గత వారంలో ధాయి లాండ్ వెళ్లిన వారి వివరాలు గోప్యంగా సేకరిస్తున్నారు SB, ఇంటెలిజెన్స్ పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news