రాజమండ్రిలో నియోజకవర్గాల ఇన్చార్జిలతో పవన్ కళ్యాణ్ భేటీ

-

నేడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ పర్యటనలో ఫుల్ బిజీగా ఉన్నారు. నేడు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను పరామర్శించారు పవన్ కళ్యాణ్. ఆ తరువాత రాజమండ్రిలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అసెంబ్లీ నియోజక వర్గాల జనసేన ఇంఛార్జిలతో సమావేశమయ్యారు. పార్టీ తరపున చేపట్టబోయే కార్యక్రమాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పాల్గొన్నారు.

కాగా…రేపు జనసేన పార్టీ కార్యాలయంలో కీలక సమావేశం నిర్వహించనున్న పవన్ కళ్యాణ్… మండల పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహించనున్నారు. పార్టీ ఆవిర్భావం తర్వాత తొలిసారి మండల పార్టీ అధ్యక్షులతో సమావేశం నిర్వహిస్తోన్న జనసేన….ఇప్పటికే నియోజకవర్గాల వారీగా వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తోన్నారు జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు. ఎన్నికలకు సమాయత్తం చేసే క్రమంలోనే మండల పార్టీ అధ్యక్షులతో భేటీ కానున్నారు పవన్.

Read more RELATED
Recommended to you

Latest news