ప్రత్యేక విమానంలో విశాఖ బయలుదేరిన సీఎం జగన్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విశాఖపట్నంలో పలు కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో కొద్దిసేపటి క్రితం తాడేపల్లి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్న సీఎం జగన్.. ప్రత్యేక విమానంలో విశాఖ బయలుదేరారు. సీఎం జగన్ పర్యటన పూర్తి వివరాలు.. సాయంత్రం 3.50 గంటలకు పీఎం పాలెం వైఎస్సార్‌ స్టేడియంకు చేరుకోనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ విగ్రహాన్ని ఆవిష్కరణ, సాయంత్రం 4.50 గంటలకు ఆరిలోవలోని అపోలో కేన్సర్‌ ఆస్పత్రిని ప్రారంభించనున్నారు సీఎం జగన్.

సాయంత్రం 5.50 గంటలకు వీఎంఆర్డీఏ అభివృద్ది చేసిన సీ హారియర్‌ యుద్ద విమాన మ్యూజియంను ప్రారంభించనున్న సీఎం జగన్.. రామ్‌ నగర్‌లోని వీఎంఆర్డీఏ కాంప్లెక్స్, ఎంవీపీలోని ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనాను ప్రారంభించనున్నారు. అనంతరం ఎండాడలోని కాపు భవనం, భీమిలిలోని ఫిష్‌ ల్యాండింగ్‌ సెంటర్‌ శంకుస్ధాపన చేస్తారు. సాయంత్రం 6.15 గంటలకు ఏయూ కన్వెన్షన్‌ హాల్లో ఎమ్మెల్యే గొల్ల బాబురావు కుమారుడి వివాహ రిసెప్షన్‌ వేడుకలో పాల్గొననున్న సీఎం… ఇవాళ రాత్రి 8.20 గంటలకు తిరిగి తాడేపల్లికి చేరుకోనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news