డబుల్ స్ట్రైక్: రషీద్ ఖాన్ దెబ్బకు ఒకే ఓవర్లో “రోహిత్ & ఇషాన్” అవుట్

-

వాంఖడే స్టేడియం లో ప్రస్తుతం ముంబై మరియు గుజరాత్ జట్ల మధ్యన హోరాహోరీ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న గుజరాత్ ముంబై ఓపెనర్లు రోహిత్ శర్మ మరియు ఇషాన్ కిషన్ ల దూకుడుకు పవర్ ప్లే లోనే 61 పరుగులను పిండుకుంది. ఇక వీరిద్దరూ మరో అయిదు ఓవర్ లు ఉన్నా గుజరాత్ కు బొమ్మ చూపించి ఉంటారు. కానీ పవర్ ప్లే అనంతరం రషీద్ ఖాన్ వేసిన 7 వ ఓవర్ లో మొదటి బంతికి రోహిత్ ను అవుట్ చేశాడు. అదే ఓవర్ లో అయిదవ బంతికి ఇషాన్ కిషన్ ను అవుట్ చేసి గుజరాత్ కు డబుల్ బ్రేక్ ను అందించాడు.

అయినా వికెట్లు పడినా ముంబై భారీ స్కోర్ దిశగా పరుగులు తీస్తోంది. సూర్య మంచి ఫామ్ లో ఉండడంతో ఖచ్చితంగా 200 కు పైగానే టార్గెట్ ను గుజరాత్ ముందు ఉంచుతారు.

Read more RELATED
Recommended to you

Latest news