ఐపీఎల్ 2023: చావో రేవో మ్యాచ్ లో ఫీల్డింగ్ ఎంచుకున్న వార్నర్ భాయ్ … !

-

ఐపీఎల్ లో ప్లే ఆఫ్ లో ఆడాల్సిన నాలుగు జట్లపై ఇంకా ఒక స్పష్టత రాలేదు, అనధికారికంగా అయితే సన్ రైజర్స్ , కోల్కతా మరియు ఢిల్లీ క్యాపిటల్స్ జట్లు ప్లే ఆఫ్ కు దూరం అయ్యాయి. కానీ అధికారికంగా తెలియాలి అంటే ఖచ్చితంగా మరో రెండు రోజులు గడిస్తేనే కానీ తెలియదు. అందులో ఈ రోజు జరగనున్న మ్యాచ్ తో ఒక విషయం తేటతెల్లం కానుంది. పంజాబ్ మరియు ఢిల్లీ లు తలపడుతున్న ఈ మ్యాచ్ లో ఢిల్లీ ఓడిపోతే ఖచ్చితంగా ఇక ప్లే ఆఫ్ కు అవకాశం లేదు. ఒకవేళ ఢిల్లీ గెలిస్తే మిగిలిన జట్ల ఫలితాల మీద ఆధారపడి అదృష్టం కలిసి వస్తే ప్లే ఆఫ్ కు చేరగలదు.

ఇటువంటి క్లిష్టమైన మ్యాచ్ లో ఢిల్లీ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. గత మ్యాచ్ లో ఆడిన జట్టునే కొనసాగిస్తోంది. కాగా పంజాబ్ కు కూడా కీలక మ్యాచ్ కావడం వలన ఫలితం ఎవరికి ఫేవర్ గా రానుందో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news