BREAKING : క్షణం ఆవేశంతో సొంతింటికి నిప్పు… క్షణాల్లో లక్షల నష్టం!

-

తెలంగాణలోని కామారెడ్డి జిల్లా బీర్కూరులో దారుణం చోటు చేసుకుంది. మాములుగా అందరి కుటుంబాలలో చైనా చిన్న గొడవలు జరగడం చూస్తుంటాము. అదే విధంగా బీర్కూరు లోని చంద్రవ్వ అనే ఇంట్లో జరిగిన చిన్న గొడవ వారికి లక్షల నష్టాన్ని మిగిల్చింది. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం… కుటుంబంలో గొడవ జరగ్గా .. కోపంతో రగిలిపోయిన చంద్రవ్వ కొడుకు అశోక్ ఆవేశంలో వారి ఇంటికే నిప్పు అంటించాడు, వెంటనే నిప్పులు చెలరేగడంతో ఇంట్లో ఉన్న గ్యాస్ సిలిండర్ కూడ పేలిపోయింది. దీనితో మంటలు పెద్ద స్థాయిలో చెలరేగడంతో ఇల్లు అంతా కాలిపోయింది. ఈ మంటలలో ఫ్రిడ్జ్, ఒకటిన్నర లక్ష నగదు మరియు 8 తులాల బంగారం పూర్తిగా కాలిపోవడం చాలా బాధాకరం అని చెప్పాలి.

ఈ ఘటనతో అశోక్ తల్లి చంద్రవ్వ తీర్వ దుఃఖంలో మునిగిపోయింది. ఈ సంఘటన గురించి తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news