చంద్రబాబుతో సహా టీడీపీ వెంటిలేటర్ మీద ఉంది – సీఎం జగన్

-

చంద్రబాబుతో సహా టీడీపీ వెంటిలేటర్ మీద ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్. చంద్రబాబుతో సహా టీడీపీ వెంటిలేటర్ మీద ఉంది.. దత్త పుత్రుడు రెండు చోట్ల పోటీ చేస్తే ఒక్క చోట కూడా ప్రజలు నమ్మలేదని ఎద్దేవా చేశారు. దండం పెట్టి పంపారు.. ఒక్కో ఎన్నికకు ఒక్కో రేటు పెట్టి పార్టీని అమ్ముతున్న ప్యాకేజ్ స్టార్‌కు సీఎం పదవి అవసరం లేదంట అంటూ ఎద్దేవా చేశారు సీఎం జగన్‌.

chandrababu naidu ys jagan

ఏపీలో దోచుకుని..తెలంగాణలో బతుకుతున్నారని చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ లపై సీఎం జగన్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్సార్‌ మత్స్యకార భరోసా నిధులను విడుదల చేసిన అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్‌ మాట్లాడారు. సముద్రాన్ని నమ్ముకున్న మత్స్యకార కుటుంబాలకు ఎలాంటి కష్టం రానివ్వను.. వైఎస్ఆర్ మత్స్య కార భారోసాలో ఒక్కొక్క కుటుంబానికి యాభై వేల రూపాయలు అందించాం.. వేట నిషేధ సమయంలో ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయం మత్స్యకార కుటుంబాలకు ఉపయోగ పడుతుందని వివరించారు సీఎం జగన్‌. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రతి పేద కుటుంబానికి మేలు చేయాలన్న తపనతో పని చేస్తున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news