జగన్ ని తప్ప ఎవరినీ లెక్క చేయను – బాలినేని కీలక వ్యాఖ్యలు

-

తాను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తప్ప ఇంకెవరిని లెక్క చేసే ప్రసక్తే లేదని అన్నారు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసులు రెడ్డి. నేడు ఒంగోలు నగరంలో నూతన అర్బన్ హెల్త్ సెంటర్ ని ప్రారంభించారు బాలినేని. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను రాజకీయాలలోకి అడుగుపెట్టినప్పటి నుండి రాజీలేని రాజకీయాలే చేశానన్నారు. తాను ఒక సీఎం జగన్ ని తప్ప మరెవరిని లెక్క చేసే ప్రసక్తి లేదన్నారు.

ప్రజా సంక్షేమం దృష్టిలో ఉంచుకొని జగన్ విద్య, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. ఇక సోమవారం ఒక కార్యక్రమంలో పాల్గొన్న బాలినేని ఒంగోలులో పోటీపై క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఎన్నికలలో ఒంగోలు నుంచి మరోసారి పోటీ చేసి తీరుతానంటూ స్పష్టం చేశారు. తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చింది ఒంగోలేనని, మరోసారి ఒంగోలు నుంచే పోటీ చేస్తానంటూ స్పష్టం చేశారు. వైసీపీలో అయిన వాళ్లే తనపై కుట్రలు చేసి ఇబ్బంది పెడుతున్నందుకు బాధపడ్డానని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news