నరేష్‌-పవిత్రలకు షాక్‌..’మళ్లీ పెళ్లి’ విడుదల ఆపాలని పిటిషన్

-

నరేష్‌ హీరోగా మళ్లీ పెళ్లి అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాని ప్రముఖ సీనియర్ దర్శకనిర్మాత ఎమ్మెస్ రాజు తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా నుంచి టీజర్ విడుదల చేయగా అందులో రమ్య రఘుపతి తో గొడవలు, ఆమె మీడియా ముందుకు వచ్చి చేసిన ఆరోపణలు, అలాగే రమ్య నరేష్ పై చేయించిన దాడులు అన్నింటినీ కూడా తమ నిజ జీవిత ఆధారంగా తెరకెక్కించిన సన్నివేశాలను మనం ఇందులో చూడవచ్చు.

MS రాజు డైరెక్షన్ వహించిన ఈ చిత్రం ఈనెల 26న రిలీజ్ కానుంది. అయితే.. సీనియర్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ సినిమా విడుదలకు ఆపాలని నరేష్ భార్య రమ్య రఘుపతి కూకట్ పల్లి ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. ఈ సినిమా తన ప్రతిష్టను కించపరిచేలా ఉందని ఆరోపించిన ఆమె రేపు సినిమా విడుదల కాకుండా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీంతో రేపు సినిమా విడుదలపై ఉత్కంఠ కొనసాగుతోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news