సీఎం జగన్ నాలుగేళ్ల పాలన ఒక చరిత్ర – సజ్జల

-

జగన్ నాలుగేళ్ల పాలన ఒక చరిత్ర అని.. సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడి ఇవాళ్టికి నాలుగేళ్లు పూర్తి అయింది. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి .. వైసీపీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం.. సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..ఎన్నికలు వస్తున్నాయి అనగానే గుంట నక్కలు పగటి వేషాలు వేసుకొని వస్తున్నాయని ఆగ్రహించారు.

ప్రజలను భ్రమల్లో పెట్టి మళ్లీ అధికారంలోకి రావటానికి ప్రయత్నిస్తున్నాయి.. కోటి 60 లక్షల కుటుంబాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందాయని వెల్లడించారు సజ్జల రామకృష్ణారెడ్డి. 2014-19 మధ్య చంద్రబాబు ఏం చేశాడు?.. చెప్పుకోవటానికి చంద్రబాబుకు ఒక పథకం అయినా ఉందా? అందరూ అప్రమత్తంగా ఉండాలి.. ఎన్నికల్లో వెన్నుపోట్లు, పక్క పోట్లు అన్నీ ఉంటాయని స్పష్టం చేశారు. వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు అందరూ ఒక్కటిగా పని చేయాలి.. గుంట నక్కల వ్యవహారాలను ప్రజలకు వివరించండని కోరారు సజ్జల రామకృష్ణారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news