మనీష్ సిసోదియాకు దిల్లీ హైకోర్టులో చుక్కెదురు

-

దిల్లీ లిక్కర్ స్కామ్​లో అరెస్టయిన ఆప్ నేత మనీశ్ సిసోదియాకు దిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ నమోదు చేసిన కేసులో ఆయనకు బెయిల్‌ ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించింది. ఈ మేరకు దిల్లీ హైకోర్టు న్యాయమూర్తి దినేశ్ కుమార్‌ శర్మ ఈరోజు ఉదయం తీర్పు వెలువరించారు. సిసోదియాపై ఉన్న ఆరోపణలు చాలా తీవ్రమైనవని.. ఆయన బెయిల్‌పై బయటకు వస్తే సాక్ష్యులను ప్రభావితం చేసే అవకాశాలను కొట్టిపారేయలేమని తెలిపింది. అందువల్ల ఆయనకు బెయిల్‌ ఇవ్వలేమని న్యాయస్థానం వెల్లడించింది.

ప్రభుత్వ మద్యం విధాన రూపకల్పన, అమలులో అవకతవకలు చోటుచేసుకున్న వ్యవహారంపై జరుపుతున్న దర్యాప్తులో భాగంగా ఈ ఏడాది ఫిబ్రవరి 26న సీబీఐ అధికారులు సిసోదియాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అనంతరం కోర్టులో హాజరుపర్చగా.. తొలుత న్యాయస్థానం సీబీఐ కస్టడికి అప్పగించింది. అనంతరం జ్యుడీషియల్‌ కస్టడీ విధించడంతో ఆయనను తిహాడ్‌ జైలుకు తరలించారు. ఇటీవల ఆయన కస్టడీని దిల్లీలోని రౌస్‌ అవెన్యూ కోర్టు జూన్‌ 1వ తేదీ వరకు పొడిగించింది.

Read more RELATED
Recommended to you

Latest news