నేడు నాగపూర్‌లో BRS కార్యాలయం ప్రారంభం

-

బీఆర్​ఎస్ పార్టీని జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా మార్చడానికి ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రంగా శ్రమిస్తున్నారు. పార్టీ ప్రకటించిన రోజు నుంచేమహారాష్ట్రలో కార్యకలాపాలు షురూ చేశారు. ఇక అక్కడి ప్రజలను ఆకట్టుకోవడానికి తరచూ సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే నాగ్​పూర్​లో బీఆర్ఎస్ ప్రధాన పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు.

అనంతరం పార్టీ కార్యకర్తలతో ముచ్చటించి.. వారిలో జోష్​ నింపనున్నారు. ఇతర పార్టీలకు చెందిన పలువురు నాయకులు, సామాజిక కార్యకర్తలు కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరనున్నారు. అందుకు తగిన ఏర్పాట్లను పార్టీ శ్రేణులు పూర్తి చేశారు. ఇప్పటికే దేశవ్యాప్తంగా బీఆర్​ఎస్​ పార్టీ కార్యాలయాలను ప్రారంభించాలని సీఎం కేసీఆర్​ ప్రణాళికలను సిద్ధం చేశారు. అందులో భాగంగానే మొదటగా దిల్లీలో శాశ్వత కార్యాలయం ప్రారంభించగా.. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్​లోనూ.. తాజాగా మహారాష్ట్రలోని నాగపూర్​లో ప్రారంభించనున్నారు. త్వరలోనే ఇంకా మహారాష్ట్రలోని పుణె, ముంబయి, ఔరంగాబాద్​లలో కార్యాలయాల ఏర్పాటుకు సన్నాహకాలు చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news