బీజేపీ నుంచి బయటకు వెళ్లే వారిపై విజయ శాంతి సంచలన వ్యాఖ్యలు

-

బీజేపీ నుంచి బయటకు వెళ్లే వారిపై విజయ శాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ నుండి ఒకరు వేరే పార్టీకి వెళ్తారు…ఒకరిద్దరు బీజేపీలో చేరటం లేదని తెలిపారు. బీజేపీలో ఒకరిద్దరికి పదవుల కేటాయింపు చాలా పెద్ద సమస్య…ఎందుకో పై అంశాల మీదనే మీడియా ప్రచారం ఎక్కువగా ఉన్నది… ఇట్లా బయటకు వినిపించే కథనాలు, స్పెక్యులేషన్లతో బీజేపీ బలహీనపడదని వెల్లడించారు విజయ శాంతి.

ఎన్నికలు ఏవైనా తెలంగాణలో గత రెండు మూడు సంవత్సరాలుగా అత్యధికంగా గెలుస్తూ లేదా 2వ స్థానంలో ఉంటూ వచ్చిన బీజేపీ బలహీనమైనది ఎక్కడో….కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గెలిస్తే బీఆరెస్‌కు దుమికి తీరుతారనే వాస్తవం ఏ విధంగా ప్రజల దృష్టి నుండి కాంగ్రెస్ నేతలు మరలుస్తారో అందరూ ఆలోచించవలసిందేని పేర్కొన్నారు.

నిస్వార్థ బీజేపీ సైద్ధాంతిక కార్యకర్తలందరూ… ఈ పదవులు, పార్టీ మార్పులు వంటి రోజువారీ వార్తలతో విసుగు చెందినట్లు అభిప్రాయపడుతున్నారని…విజయశాంతి వివరించారు. ఈ అంశాలన్నీ కాక, మన బీజేపీ, మన ఆవేశం, మన ధర్మం, మన సంస్కృతి అనే విధానంలో బీఆరెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిలదీస్తూ.. అధ్యక్షులు బండి సంజయ్ గారి నేతృత్వంలో తుఫాను ఉద్యమాలు నిర్మించబడాలని… బీఆరెస్ దుర్మార్గం నుండి తెలంగాణ కాపాడబడాలని విశ్వసిస్తూ జై శ్రీరామ్ అంటూ పోస్ట్‌ పెట్టారు విజయ శాంతి.

Read more RELATED
Recommended to you

Latest news