BREAKING : నల్లమల అటవీ ప్రాంతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహం ఆవిష్కరణ

-

BREAKING : నల్లమల అటవీ ప్రాంతంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి విగ్రహం ఆవిష్కరణ చేయనున్నారు. ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలోని పాలుట్ల గిరిజన గూడెంలో నేడు, రేపు మంత్రి ఆదిమూలపు సురేష్ పర్యటించనున్నారు. ఈ మేరకు అటవీ ప్రాంతంలో పర్యటనకు ప్రత్యేక వాహనాల్లో పయనం చేయనున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్‌.

ఇక ఇవాళ రాత్రి నల్లమల లోనే బస చేయనున్న మంత్రి ఆదిమూలపు సురేష్‌…. పాలుట్ల గూడెంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం… నల్లమల అటవీ ప్రాంతంలో దివంగత నేత వై. ఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు మంత్రి ఆదిమూలపు సురేష్. ఇక నిన్న మీడియాతో మంత్రి ఆదిమూలపు సురేష్‌ మాట్లాడుతూ…జగనన్నకు చెబుదాంకు అనుబంధంగా జగనన్న సురక్ష జరుగుతుందని… మండలానికి రెండు సచివాలయాలలో ఒక్కోరోజు క్యాంపులు జరుగుతాయని చెప్పారు. ప్రతి లబ్ధిదారులకు న్యాయం చేయాలన్నదే లక్ష్యమని వివరించారు.

Read more RELATED
Recommended to you

Latest news