షాద్‌నగర్‌ వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు దుర్మరణం

-

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బొలేరో వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్న ఘటనషాద్‌నగర్‌ పురపాలిక పరిధిలోని సోలిపూర్ గ్రామ శివారులో జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరణించారు.

ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం బెంగళూరు జాతీయ రహదారిపై హైదరాబాద్‌ నుంచి కర్నూలు వైపు వెళ్తున్న బొలేరో వాహనం అదుపుతప్పి డివైడర్‌ పైకి ఎక్కి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరు ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందారు. మృతులు, క్షతగాత్రులను వనపర్తి జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన అశోక్(28), శంకర్(32), రవి(30)లుగా పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణం అతివేగమా లేక నిద్ర మత్తులో జరిగిందా అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news