మహారాష్ట్రలో బస్సులో మంటలు.. 25 మంది దుర్మరణం

-

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 25 మంది సజీవ దహనమయ్యారు. ఆ రాష్ట్రంలో బుల్దానాలోని సమృద్ధి మార్గ్ ఎక్స్​ప్రెస్​ హైవేపై ఇవాళ వేకువజామున 2 గంటలకు ఈ ఘటన జరిగింది. యావత్మాల్​ నుంచి పుణెకు 32 మంది వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 25 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు.

తెల్లవారుజాము కావడంతో ఆ చుట్టు పక్కన ఎవరూ లేరు. చివరి నిమిషంలో ఆవైపుగా వెళ్తున్న వారు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న అధికారులు మంటలు ఆర్పేందుకు యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టారు. ఆ సమయంలో బస్సులో నుంచి భీకరమైన హాహాకారాలు వినిపించాయి. ఆ ప్రాంతమంతా భయకంపితంగా మారిపోయింది. ఈ ఘటనలో 25 మంది సజీవదహనం అయినట్లు పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన మరికొంత మందిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు వెల్లడించారు. అందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో బస్సు పూర్తిగా దగ్ధమైందని పోలీసులు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news