తిరుమల భక్తులకు శుభవార్త..ఇవాళ ఆర్జిత సేవా టికెట్లు విడుదల

-

తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త చెప్పింది టీటీడీ పాలక మండలి. ఇవాళ ఆర్జిత సేవా టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ పాలక మండలి. ఇవాళ అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవా టిక్కేట్లను విడుదల చెయ్యనుంది. కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవా టిక్కేట్లు విడుదల చేయనున్న టిటిడి…ఈ నెల 24వ తేదిన అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షణ టోకేన్లు విడుదల చెయ్యనుంది.

కాగా, తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టు మెంట్లు పూర్తిగా నిండిపోయి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. అటు టోకేన్ లేని భక్తులు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 63628 మంది భక్తులు కాగా….33548 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.26 కోట్లుగా నమోదు అయింది.

Read more RELATED
Recommended to you

Latest news