హైదరాబాద్ ను డల్లాస్, ఓల్డ్ సిటీని ఇస్తాంబుల్ చేస్తామని నరక కూపంగా మార్చారని రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో గత వారం రోజులుగా వరదలతో ప్రజలు అతలాకుతలం అవుతుంటే ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయిందని ఆగ్రహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ, మునిసిపల్ మంత్రి కేటీఆర్ గానీ ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదని విమర్శలు చేశారు.
కేటీఆర్ పుట్టిన రోజు మోజులో ఉండి ప్రజలను మరచిపోయారని.. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం కనీసం సమీక్ష చేయడంలేదని ఆగ్రహించారు. వారం రోజులుగా భారీ వర్షాలతో రాష్ట్రం మొత్తము అల్లకల్లోలంగా మారిందని.. ట్రాఫిక్ సమస్యలతో ప్రజలు నానా యాతన పడుతున్నారు. గంటలకొద్దీ రోడ్లపైనే ప్రజలు కష్టాలు పడుతున్నారన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా అభివర్ణించారు. హైదరాబాద్ డల్లాస్, ఓల్డ్ సిటీ ఇస్తాంబుల్ చేస్తామని ప్రగల్బాలు పలికిన కేసీఆర్, కేటీఆర్ హైదరాబాద్ నరక కూపంగా మార్చారని ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు రేవంత్ రెడ్డి.