“తెలుగుతేజం” పీవీ సింధు జపాన్ ఓపెన్ తొలి రౌండ్ లో ఓటమి !

-

స్టార్ షట్లర్ పీవీ సింధుకు ఈ సంవత్సరం అస్సలు కలిసిరాలేదు అని చెప్పాలి. ఈ ఏడాది జరుగుతున్న అన్ని టోర్నమెంట్ లలోనూ మధ్యలోనే ఓడిపోయి ఇంటి దారి పడుతూ వచ్చింది. ఇక తాజాగా జరుగుతున్న జపాన్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్ 750 లోనూ నిరాశపరిచింది. తాను ఆడిన మొదటి రౌండ్ లోనే ఊహించేవిధంగా ఓడిపోయి టోర్నీ నుండి నిష్క్రమించింది. మొదటి రౌండ్ లో చైనాకు చెందిన జియాంగ్ యిమాన్ తో తలపడగా సింధు 12 – 21 , 13 – 21 తేడాతో వరుస సెట్ లలోనే కనీసం ప్రతిఘటించకుండానే ఓటమిని ఒప్పుకుంది. ఈ సంవత్సరం సింధు బి డబ్ల్యు ఎఫ్ వరల్డ్ టూర్ టోర్నీలలో ఆడగా 7 టోర్నీలలో కేవలం మొదటి రౌండ్ లోనూ ఓటమి పాలయింది. కాగా ఒలింపిక్స్ కు సమయం సమీపిస్తుండడంతో ఈ తరహా ఆటతీరు పట్ల అభిమానులు, కోచింగ్ స్టాఫ్ మరియు ఫ్యామిలీ అందరూ నిరాశలో ఉన్నారు.

మరి త్వరగానే ఈ వైఫల్యాల నుండి సింధు పుంజుకుని మునుపటిలా వరుస విజయాలను సాధించాలని కోరుకుందాం.

Read more RELATED
Recommended to you

Latest news