అవినీతితో వైసీపీ నేతల పొట్టలు పెరుగుతున్నాయి – చంద్రబాబు

-

వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు. కోస్తాంధ్ర ప్రాజెక్టులపై టీడీపీ హయాంలో రూ. 21,442 కోట్లు ఖర్చు పెడితే.. వైసీపీ హయాంలో కేవలం రూ. 4375 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని ఆరోపించారు. కోస్తాంధ్ర పరిధిలో 96 ప్రాజెక్టులను ప్రీ క్లోజర్ చేశారని అన్నారు. పోలవరం కుడి కాల్వ మట్టిని దోచుకున్నారని.. కాల్వలను దోచేస్తూ తీవ్ర తప్పిదాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.

టిడిపి హయాంలో మొత్తంగా 64 ప్రాజెక్టులు మొదలెట్టి 23 పూర్తి చేశామని తెలిపారు. నాలుగేళ్లలో 4% ప్రాజెక్టులు పనులే చేశారని.. ఈ విషయంలో సిగ్గు అనిపించడం లేదా..? అని ప్రశ్నించారు. తాము నీళ్ళు ఇచ్చి సిరులు పండించాలి అనుకుంటే.. జగన్ ప్రభుత్వం రక్తాన్ని పారిస్తోందన్నారు. ప్రజా ద్రోహానికి పాల్పడితే ప్రజలు క్షమించరని అన్నారు చంద్రబాబు. మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అవినీతిలో భాగస్వాములు అవుతున్నారని.. అవినీతితో వైసీపీ నేతల పొట్టలు పెరుగుతున్నాయి.. కానీ ప్రాజెక్టుల కోసం నిధులు ఉండవా..? అంటూ దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Latest news