హెరిటేజ్ లో గంజాయి.. నారావారి పల్లెలో ఎర్రచందనం దొరుకుతోంది – మంత్రి రోజా

-

అనంతపురం: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా. శుక్రవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ వల్ల ఎంత మంది అమ్మాయిలు అదృశ్యమయ్యారో లెక్క తేలాలన్నారు. ఏపీలో మహిళల అదృశ్యంపై ఏ నిఘా సంస్థ పవన్ కళ్యాణ్ కు నివేదిక ఇచ్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు.

హెరిటేజ్ లో గంజాయి.. నారావారి పల్లిలో ఎర్రచందనం దొరుకుతోందని విమర్శించారు. రాష్ట్రంలో ఇంకెక్కడా గంజాయి దొరకలేదన్నారు. రాయలసీమ నిజమైన ద్రోహి చంద్రబాబు నాయుడేనని అన్నారు రోజా. 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు సీమ ప్రాజెక్టులను పరిశీలించే అర్హత లేదన్నారు. అమ్మ ఒడి, రైతు భరోసా, రైతునేస్తం వంటి ప్రజలకు ఉపయోగపడే పథకాలను చంద్రబాబు ఎందుకు తీసుకు రాలేదని ప్రశ్నించారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ గంజాయి సాగును ఉక్కు పాదంతో అనచివేస్తున్నారని అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news