కిషన్ రెడ్డి సమైక్యవాది.. పార్టీని నాశనం చేశాడు – జిట్టా బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

-

కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పై తీవ్ర విమర్శలు చేశారు జిట్టా బాలకృష్ణారెడ్డి. తాను తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేశానని.. 2007లోనే సమైక్యరాష్ట్రంలో తెలంగాణ కోసం ఎంతగానో పోరాడని తెలిపారు. తెలంగాణ వచ్చాక ఆ ఆశయాలు నెరవేరడం లేదని యువ తెలంగాణ పార్టీని స్థాపించానని.. అనంతరం బిజెపిలోకి వెళ్తే న్యాయం జరుగుతుందని ఆ పార్టీని బిజెపిలో విలీనం చేశానని తెలిపారు. తనను పార్టీ నుండి ఎందుకు సస్పెండ్ చేశారో కారణాలు చెప్పడం లేదన్నారు బాలకృష్ణ.

మూడుసార్లు పార్టీకి అధ్యక్షుడు అయిన కిషన్ రెడ్డి పార్టీని నాశనం చేశాడని తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణకు వచ్చిన మోడీ, అమిత్ షా, నడ్డా తెలంగాణలో కేసీఆర్ అవినీతి, కాళేశ్వరం పై మాట్లాడారని.. కానీ చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కవిత లిక్కర్ స్కామ్ ఏమైందని రాష్ట్ర ప్రజలకు సందేహాలు ఉన్నాయన్నారు. కిషన్ రెడ్డి సమైక్యవాది.. తాను తెలంగాణ వాదిని అన్నారు. మునుగోడు లో రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడానికి బీజేపీ కారణమని ఆరోపించారు.

Read more RELATED
Recommended to you

Latest news