కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పాలమూరు అభివృద్ధి జరిగింది – డీకే అరుణ

-

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే పాలమూరు అభివృద్ధి జరిగిందని అన్నారు బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ. సోమవారం మహబూబ్ నగర్ లో బిజెపి పార్టీ మహా ర్యాలీకి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి తో పాటు రాష్ట్ర బిజెపి ప్రధాన కార్యదర్శి ప్రదీప్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, ఆచారి, తదితరులు పాల్గొన్నారు. మహబూబ్ నగర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి క్లాక్ టవర్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు.

అనంతరం క్లాక్ టవర్ వద్ద నిర్వహించిన సభలో డీకే అరుణ మాట్లాడుతూ.. బిజెపి అధికారంలోకి వస్తే పేద ప్రజలందరికీ ఇల్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వకుండా సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. సొంతంగా ఇల్లు కట్టుకోవడానికి ప్రజలకు ఐదు లక్షలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదని మండిపడ్డారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news