Bumrah : ఐర్లాండ్ పర్యటనకు కెప్టెన్‌గా బుమ్రా

-

ఐర్లాండ్ జట్టుతో టి20 సిరీస్ కు టీమిండియా జట్టును ప్రకటించింది బీసీసీఐ పాలకమండలి. అయితే ఈ నేపథ్యంలోనే టీమిండియా ఫ్యాన్స్ కు అదిరిపోయే శుభవార్త చెప్పింది బిసిసిఐ. ఈ టి20 సిరీస్ కు టీం ఇండియా ఫాస్ట్ బౌలర్ బుమ్రా అందుబాటులో ఉండనున్నాడు. అంతేకాదు… టీమిండియా కెప్టెన్ గా కూడా బుమ్రా నియమించింది బీసీసీఐ.

ఇక వైస్ కెప్టెన్ గా సీఎస్కే స్టార్ బ్యాట్స్మెన్ రుతురాజ్ గైక్వాడ్ ను నియామకం చేసింది బీసీసీఐ. ఇక ఈ టి 20 మ్యాచ్లు ఆగస్టు 18 వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. ఐర్లాండ్తో మూడు టి20 మ్యాచ్లను టీమిండియా ఆడనుంది.

ఐర్లాండ్ టీ20లకు భారత జట్టు: జస్ప్రీత్ బుమ్రా (సి), రుతురాజ్ గైక్వాడ్ (విసి), యశస్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, సంజు శాంసన్ (వికె), జితేష్ శర్మ (వికెట్), శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, షాబాజ్ అహ్మద్, రవి బిష్ణోయ్ , ప్రసిద్ కృష్ణ, అర్ష్దీప్ సింగ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్

Read more RELATED
Recommended to you

Latest news