ఏపీలో సమ్మిట్ పెట్టనిస్తే లక్ష కోట్లు తెస్తాను : కేఏ పాల్

-

ప్రపంచంలో కే ఏ పాల్ అంటే తెలియని దేశాధ్యక్షులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈయన ప్రపంచ శాంతి కోసం ఎంతో కృషి చేశానని ఇంటర్వ్యూ ల ద్వారా చాలా సార్లు చెప్పుకొచ్చారు. ఇతను తెలుగు రాష్ట్రాలలో రాజకీయాల ద్వారా ప్రజలకు సేవచేయాలన్న మంచి ఉద్దేశ్యంతో ప్రజాశాంతి అన్న పార్టీని శపించారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేసి ఓడిపోయారు. తాజాగా ఈయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం పై కీలక వ్యాఖ్యలు చేశారు. కే ఏ పాల్ మాట్లాడుతూ వర్షాలు వరదలు ద్వారా ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.. ఏపీ ప్రభుత్వం వరదల బాధితులను ఆదుకోవడంలో సమిష్టిగా విఫలం అయిందంటూ విమర్శించారు. ఇందులో ప్రజాప్రతినిధులు మరియు అధికారులు బాధితులను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని చెప్పారు. వెంటనే వరదల బాధితులకు 2 నెలలకు సరిపోయే నిత్యావసర సరుకులు,మరియు ఇల్లు కోల్పోయిన వారికి రూ. లక్ష సాయం అందించాలి డిమాండ్ చేశారు.

ఇంకా ఏపీలో నాకు సమ్మిట్ పెట్టే ఛాన్స్ ఇస్తే రూ. లక్ష కోట్లు తీసుకువస్తానని హామీ ఇచ్చారు కే ఏ పాల్.

Read more RELATED
Recommended to you

Latest news