సీఎం జగన్‌కు చంద్రబాబు మరో సెల్ఫీ ఛాలెంజ్‌.. ఈ సారి కియా వద్ద

-

టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు పెనుగొండలోని కియా కార్ల పరిశ్రమ వద్దకు వచ్చారు . టీడీపీ హయాంలో వచ్చిన కియా కార్ల పరిశ్రమ వద్ద సెల్ఫీ తీసుకుని వైసీపీ ప్రభుత్వానికి చంద్రబాబు ఛాలెంజ్ విసిరారు. వైసీపీ అనంతపురం జిల్లాకు తెచ్చిన పరిశ్రమలు ఎన్నో? పూర్తి చేసిన సాగునీటి ప్రాజెక్టులు ఎన్నో చెప్పాలంటూ ఛాలెంజ్ చేశారు.

Chandrababu Naidu: కియా పరిశ్రమ ముందు చంద్రబాబు సెల్ఫీ.. వైసీపీ ప్రభుత్వం  అనంతపురానికి ఏం తెచ్చిందంటూ సవాల్.. - Telugu News | Chandra Babu Naidu  Takes Selfie at KIA Motors in ...

టీడీపీ ప్రభుత్వ హయాంలో గొల్లపల్లి నుంచి కియా కార్ల పరిశ్రమకు నీటి సరఫరా చేశామని చంద్రబాబు వెల్లడించారు. రికార్డు సమయంలో రూ.13 వేల కోట్ల పెట్టుబడులతో పరిశ్రమ ఏర్పాటు చేసినట్టు వివరించారు. పెనుకొండ ప్లాంటులో తయారైన కియా కార్ల అమ్మకాల ద్వారా వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తోందని తెలిపారు. “అనంతపురం జిల్లాలో కియా పరిశ్రమ ఒక ప్రభంజనం. కరవు నేలపై ఎవరైనా కియా పరిశ్రమను ఊహించారా? అనంతపురం జిల్లాపై ప్రేమతోనే ఈ ప్రాజెక్టును తీసుకువచ్చాను. కేవలం ఆరు నెలల్లో గొల్లపల్లి పూర్తి చేసి కియాకు నీరు అందించాం. రాళ్ల సీమ అనిపించుకున్న రాయలసీమలో కియా సిరుల పంట టీడీపీ సాధించిన విజయం. కియా ప్లాంటులో 10 లక్షల కార్ల ఉత్పత్తి జరిగింది. కియా పరిశ్రమ స్థాపన ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచాం” అని వివరించారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news