ట్రీట్​మెంట్​ కోసం హీరో వద్ద రూ.25 కోట్లు అప్పు.. రూమర్స్​పై సమంత క్లారిటీ

-

టాలీవుడ్​ స్టార్ హీరోయిన్​ సమంత గత కొంతకాలంగా మయోసైటిస్ అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధ పడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యాధికి సామ్ చికిత్స కూడా తీసుకుంటోంది. అయితే తాజాగా ఈ బ్యూటీ సినిమాలకు ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుని ట్రీట్​మెంట్​ కోసం విదేశాలకు వెళ్తోందనే ప్రచారం జరిగింది. కానీ ఈ భామ మాత్రం ప్రస్తుతం తన వెకేషన్​ను ఎంజాయ్ చేస్తోంది.

అయితే సామ్​ తన మయోసైటిస్ ట్రీట్​మెంట్ గురించి వచ్చిన ఓ రూమర్​ గురించి తాజాగా రియాక్ట్ అయింది. తన ట్రీట్​మెంట్​ కోసం ఆమె ఓ స్టార్ హీరో దగ్గర అప్పు తీసుకున్నానంటూ వచ్చిన వార్తలను ఖండించింది. ఇన్​స్టా వేదికగా ఈ విషయంపై క్లారిటీ ఇచ్చింది ఈ అమ్మడు.

“మయోసైటిస్ చికిత్స కోసం రూ.25 కోట్లా!? ఎవరో మీకు తప్పుడు సమాచారం ఇచ్చారు. ఇందులో నేను ఖర్చు కొంచం మాత్రమే పెడుతున్నాడు. నా కెరీర్​లో సంపాదించిన మొత్తాన్ని ఖర్చు చేశానని నేను అనుకోవడం లేదు. నేను నా జాగ్రత్తలు చూసుకోగలను. మయోసైటిస్ అనేది ఓ సమస్య. వేలాది మంది దీనితో బాధపడుతున్నారు. చికిత్సకు సంబంధించిన సమాచారాన్ని పోస్ట్ చేసే ముందు దయచేసి కాస్త బాధ్యతగా ఉండాలి”అని సమంత పోస్టు పెట్టింది.

Read more RELATED
Recommended to you

Latest news