విమానంలో మందుబాబుల హల్‌చల్.. శంషాబాద్‌లో అత్యవసర లాండింగ్

-

ఈ మధ్య విమాన ప్రయాణాల్లో పలువురి ప్రయాణికుల ప్రవర్తన అనుచితంగా ఉంటోంది. ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తూ.. ఓవైపు సిబ్బందికి.. మరోవైపు తోటి ప్రయాణికులకు ఇబ్బందులు కలగజేస్తున్నారు కొందరు. ఇప్పటికే ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. వాటిఫై ఫిర్యాదులు వెళ్లాయి. దర్యాప్తు కూడా జరుగుతోంది. తాజాగా ఇలాంటి ఘటన మరొకటి చేసుకుంది. ఇంతకీ ఏం జరిగిందంటే..?

దుబాయ్‌ నుంచి కొచ్చికి బయలుదేరిన ఓ విమానంలో నలుగురు ప్రయాణికులు మద్యం మత్తులో తోటి ప్రయాణికులతో అమర్యాదగా ప్రవర్తించారు. ఇదేమని అడిగిన సిబ్బందిపై, ఇతర ప్రయాణికులపై దాడికి యత్నించారు. ఎంత సర్దిచెప్పినా వారు గొడవ మానకపోవడంతో పైలట్.. విమానాన్ని దారిమళ్లించి శంషాబాద్‌ విమానాశ్రయంలో అత్యవసర ల్యాండింగ్‌ చేశారు. ఈ విషయాన్ని హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు. ఆ నలుగుర్నీ భద్రతాధికారులు అదుపులోకి తీసుకుని… పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్జీఐఏ ఠాణా పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news