బండి సంజయ్: ఎవరు గెలిచినా BRS లోకి తీసుకోవడానికి కేసీఆర్ కుట్ర

-

తెలంగాణలో ఇంకో అయిదు నెలల కాలంలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. అందుకోసం అధికార BRS, బీజేపీ మరియు కాంగ్రెస్ లు ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తున్నారు. ఎవరు గెలుస్తారన్న ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది.. కానీ అన్ని పార్టీలు ఈసారి విజయం మాదే అంటూ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మీడియా తో మాట్లాడుతూ అధికార పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారంలో ఉన్న BRS ను ఓడించడమే మా ప్రధాన లక్ష్యం అన్నారు బండి సంజయ్. ముందు జాగ్రత్తగా కేసీఆర్ ఇతర పార్టీలకు డాబు పెద్ద మొత్తంలో ఇస్తున్నారంటూ ఆరోపణలు చేశారు బండి. రానున్న ఎన్నికల్లో ఎవరు గెలిచినా వారిని BRS లోకి లాక్కోవడానికి కేసీఆర్ కుట్ర పన్నుతున్నారంటూ విమర్శలు చేశారు బండి సంజయ్.

ఈ విషయాన్ని అధికార పార్టీ అభ్యర్థులు గుర్తించి మేల్కోవాలని పిలుపునిచ్చారు బండి సంజయ్.

Read more RELATED
Recommended to you

Latest news