కేసీఆర్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉంది : అమిత్ షా

-

కేసీఆర్ కారు స్టీరింగ్ ఒవైసీ చేతిలో ఉంది అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిన్న చేవెళ్లలో జరిగిన కాంగ్రెస్ సభలో కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే ప్రజలను మోసం చేయడానికి బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని ఖర్గే చెప్పారు. కేసీఆర్ ని, ఓవైసిని ఎదుర్కునే పార్టీ కాంగ్రెస్ కాదు.. బీజేపీ అని చెప్పారు. 4జీ, 2జీ, 3జీ కాదు.. తెలంగాణలో వచ్చేది మోడీజీ అని జోస్యం చెప్పారు అమిత్ షా. ఎంఐఎం 3జీ పార్టీ. 

తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలి కోరారు. కేసీఆర్ ని సాగనంపాలన్నారు.  ఒవైసీతో కలిసి కేసీఆర్ తెలంగాణలో సాయుధ పోరాటంలో అమరులైన వారిని అవమానించారని పేర్కొన్నారు అమిత్ షా. తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలని కోరారు. రైతులను బీఆర్ఎస్ మోసం చేసింది. భద్రాచలం భక్తుల మనోభావాలను కేసీఆర్ దెబ్బ తీస్తున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ 4జీ పార్టీ అంటే నాలుగు తరాల పార్టీ అన్నారు అమిత్ షా. ఎంఐఎం 3జీ పార్టీ అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం, కేసీఆర్ తో కలుస్తుందన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news