తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలి : అమిత్ షా 

-

ఎప్పటి నుంచో ఖమ్మంలో అమిత్ షా సభ అని ప్రచారం జరిగింది. కానీ రెండు సార్లు వాయిదా పడింది. తాజాగా ఇవాళ ఖమ్మంలో రైతు గోస-బీజేపీ భరోసా సభ నిర్వహించారు. ఇవాళ ఈ సభకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 

కేసీఆర్ ని సాగనంపాలని.. ఒవైసీతో కలిసి కేసీఆర్ తెలంగాణలో సాయుధ పోరాటంలో అమరులైన వారిని అవమానించారని పేర్కొన్నారు అమిత్ షా. తెలంగాణలో బీజేపీ సర్కార్ రావాలని కోరారు. కేసీఆర్ భక్తుల మనోభావాలను ఏరకంగా కించపరుస్తున్నారని పేర్కొన్నారు.   భద్రాచలం రాముడికి వస్త్రాలు సమర్పించే సంప్రదాయాన్ని కేసీఆర్ పట్టించుకోవడం లేదు. రేపు వచ్చేది బీజేపీ ప్రభుత్వం.. బీజేపీ కార్యకర్తలు, నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారు. మా ఎమ్మెల్యే రాజాసింగ్ ని అరెస్టు చేస్తున్నారు. బీజేపీ వాళ్లను అరెస్ట్ చేసి అక్రమంగా అవినీతిని కొనసాగించాలని కేసీఆర్ చూస్తున్నారు. కేసీఆర్ ఆటలు ఇక సాగవు అని ఆగ్రహం వ్యక్తం చేశారు అమిత్ షా. 

 

Read more RELATED
Recommended to you

Latest news