జనగామ టికెట్ కోసం KCR ఫ్లెక్సీకి సాష్టాంగ నమస్కారం

-

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వేడి షురూ అయింది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికలపై స్పెషల్ ఫోకస్ చేశాయి. వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నాయి. ఇటీవలే బీఆర్​ఎస్ పార్టీ 115 స్థానాలకు ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించింది. దాదాపు సిట్టింగులకే ప్రాధాన్యమిచ్చింది. ఈ నేపథ్యంలో టికెట్ ఆశించిన అశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు పార్టీ మారే ప్రయత్నం చేస్తుంటే.. మరికొందరు స్వతంత్రులుగా బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

ఇంకొందరు మాత్రం ఇప్పటికీ ఆశ ఉందంటూ కేసీఆర్​, కేటీఆర్​, హరీశ్ రావుల వద్దకు వెళ్తున్నారు. ఇక తాజాగా జనగామ బీఆర్​ఎస్ టికెట్‌ బీసీ వర్గానికి చెందిన తనకే కేటాయించాలని వేడుకుంటూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఫ్లెక్సీకి ఆప్కో మాజీ ఛైర్మన్‌ మండల శ్రీరాములు సాష్టాంగ నమస్కారం చేశారు. స్థానికేతరులైన ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఈ టికెట్ కోసం తమ ప్రయత్నాలు మానుకోవాలని శ్రీరాములు డిమాండ్‌ చేశారు. ఇద్దరు ఎమ్మెల్సీలకూ ఇంకా పదవీకాలం ఉందని, ఎమ్మెల్యే కావాలనుంటే వారి సొంత నియోజకవర్గాల్లో ప్రయత్నించుకోవాలని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news