మహిళలకు రాఖీ గిఫ్ట్ ప్రకటించిన యూపీ సీఎం యోగి

-

ఈ నెల 30వ తేదీ రాఖీ పూర్ణిమను దేశం అంతటా ఎంతో సంతోషంగా జరుపుకోనున్నారు ప్రజలు. ముఖ్యంగా ఈ రాఖీ పూర్ణిమ రోజున ప్రతి అక్క మరియు చెల్లి తమకు ఉన్న అన్న లేదా తమ్ముడు కి రాఖీ కట్టి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. ఈ పండుగను నార్త్ ఇండియా లో చాలా ఆడంబరంగా జరుపుకుంటారు. కాగా ఈ పండుగను పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా మహిళలకు ఒక మంచి కానుకను ప్రకటించింది. రాఖీ పూర్ణిమ మొదలయ్యే క్షణం నుండి రెండు రోజుల వరకు మహిళలు రాష్ట్రంలోని అన్ని సిటీ బస్సులలో పూర్తి ఉచితంగా ప్రయాణం చేసే వెసులుబాటును కల్పించింది. ఈ విషయాన్ని స్వయంగా సీఎం యోగి ఆదిత్యనాధ్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ వార్తను తెలుసుకున్న రాష్ట్ర ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు.

ఇక మహిళలు అయితే ఆగష్టు 30 మరియు 31 తేదీలు సిటీ బస్సులలో సంతోషంగా తిరగనున్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రజలు అందరికీ రాఖీ పూర్ణిమ శుభాకాంక్షలు కూడా తెలియచేయడం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news