సీఎం జగన్ కి రాఖీ కట్టిన మంత్రి విడదల రజిని

-

రక్షాబంధన్ ను పురస్కరించుకొని ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డికి రాఖీ కట్టారు మంత్రి విడదల రజిని. బుధవారం కాకినాడ పర్యటనకు వెళ్లిన జగన్ కి హేలిప్యాడ్ వద్ద ఆమె రాఖీ కట్టి, స్వీట్ తినిపించి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇక రజనీకి తన ఆశీర్వాదాలు ఉంటాయని సీఎం జగన్ తెలిపారు. అనంతరం వైసిపి ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకలో సీఎం జగన్ పాల్గొని నూతన వధూవరులు అన్నపూర్ణ, సాయి ఆదర్శ్ లకు శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు రాఖీ పౌర్ణమి సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు సీఎం జగన్. ఒక అన్నగా, తమ్ముడిగా ఎప్పుడు అండగా ఉంటానని మాట ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, రక్షనే ధ్యేయంగా పాలన సాగిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news