తెలంగాణలో రామరాజ్యం రావడం ఖాయం – బండి సంజయ్

-

బుధవారం తెలంగాణ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రికిషన్ రెడ్డి సమక్షంలో విద్యాసాగర్ రావు కుమారుడు వికాస్ రావు, ఆయన సతీమణి దీపా వికాస్ రావు బిజెపి తీర్థం పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో బండి సంజయ్, బిజెపి రాష్ట్ర సభ సభ్యుడు లక్ష్మణ్, ఎంపీ ధర్మపురి అరవింద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ మాట్లాడుతూ.. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుమారుడు చన్నమనేని వికాస్, కోడలు దీప బిజెపిలో చేరడం శుభపరిణామం అన్నారు.

చెన్నమనేని రాకతో సిరిసిల్ల జిల్లాలో రెండు సీట్లును బిజెపి గెలవబోతుందని తెలిపారు. కిషన్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో రామరాజ్యం వస్తుందన్నారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ కండకావరంతో వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు చేశారు. విద్యార్థులు, మహిళలపై లాఠీచార్జ్ చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news