కాంగ్రెస్, బీఆర్ఎస్ ఎన్నికల తరువాత కలుస్తాయి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

-

బీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూములు అమ్మితే తప్పించి ప్రభుత్వం నడిచే పరిస్దితి లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒప్పందం కుదుర్చుకుని భూములు తీసుకున్నాయని ఆయన ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం తెలంగాణ ప్రజల రక్తం తాగుతోందని.. ఆసరా పించన్లు ఇచ్చి.. మద్యం పేరుతో దండుకుంటున్నారని కిషన్ రెడ్డి చెప్పారు.

గ్యాస్ ధరలు తగ్గిస్తే అర్ధం లేని విమర్శలు చేస్తున్నారని కేంద్ర మంత్రి మండిపడ్డారు. పెట్రోల్, గ్యాస్ ధరలపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్‌కు లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ లు ఎన్నికల తరవాత కలుస్తాయి అన్నారు. గతంలో కూడా కలిసి పని చేశాయి అని గుర్తు చేశారు. బడుగు బలహీన వర్గాలు కోరుకుంటున్న ప్రభుత్వం బీజేపీ తోనే సాధ్యం అన్నారు. యువత, విద్యా వంతులు బీజేపీ లోకి రావాలని హృదయ పూర్వకంగా కోరుకుంటున్నారు అని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్య పెట్టేందుకు ఎన్నికల ముందు రకరకాల ప్రయత్నాలు చేస్తుంది వాటిని అస్సలు నమ్మొద్దని సూచించారు కిషన్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news