డ్వాక్రా మహిళలకు సీఎం జగన్‌ మరో గుడ్‌ న్యూస్‌ !

-

డ్వాక్రా మహిళలకు సీఎం జగన్‌ మరో గుడ్‌ న్యూస్‌ చెప్పారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గించేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర బ్యాంకర్ల సమావేశంలో చేసిన విజ్ఞప్తితో ఇప్పటికే ఎస్బిఐ వడ్డీ తగ్గించిన సంగతి తెలిసిందే. తాజాగా కెనరా బ్యాంకు కూడా ఆమోదం తెలిపింది.

పొదుపు సంఘాల రుణాలకు వడ్డీ తగ్గింపునకు ఆమోదం తెలుపగా… ఆ ఆదేశాలను కెనరా బ్యాంకు ప్రాంతీయ జనరల్ మేనేజర్ రవివర్మ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈవో ఇంతియాజ్ కు అందజేశారు. దీంతో ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రంలో పొదుపు సంఘాల మహిళలకు ఇచ్చే రుణాలపై వడ్డీ రేట్లు తగ్గనున్నాయి. ఇక సీఎం జగన్‌ నిర్ణయంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news